ke krishna murthy: ఆ నలుగురు టీడీపీకి శత్రువులు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ

  • టీడీపీకి కాంగ్రెస్, మోదీ, జగన్, పవన్ లు శత్రువులు
  • ‘కాంగ్రెస్’ దరిద్రం టీడీపీకి అవసరం లేదు
  • ఆ దరిద్రాన్ని మేము అంటగట్టుకోం

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్’ దరిద్రం టీడీపీకి అవసరం లేదని, ఆ దరిద్రాన్ని అంటగట్టుకోమని అన్నారు. టీడీపీకి కాంగ్రెస్, మోదీ, జగన్, పవన్ కల్యాణ్ లు శత్రువులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి వీరంతా అడ్డుపడుతున్నారని, ఈ విషయం ప్రజలకూ తెలుసని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు.

More Telugu News