Shashi Tharoor: ఐరాస ప్రధాన కార్యాలయానికి శశిథరూర్.. కోర్టు అనుమతి

  • భార్య మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న శశిథరూర్ 
  • కోఫీ అన్నన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి 
  • ఢిల్లీలోని పటియాలా కోర్టు నుండి అనుమతి పొందిన శశిథరూర్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని పటియాలా కోర్టు అనుమతిని ఇచ్చింది. కేరళకు సాయం అందించమని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయాన్ని కోరడానికి, అలాగే ఇటీవల మరణించిన ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ కుటుంబాన్ని పరామర్శించడానికి విదేశాలకు వెళ్లడానికి ఆయన కోర్టు అనుమతి కోరారు. తన భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్ ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు.  

More Telugu News