మణిశంకర్ అయ్యర్పై నిషేధాన్ని ఎత్తివేసిన కాంగ్రెస్

- మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్
- వేటేసిన కాంగ్రెస్ చీఫ్
- తొమ్మిది నెలల తర్వాత నిషేధం తొలగింపు
కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ నుంచి వచ్చిన సిఫార్సులను రాహుల్ గాంధీ అంగీకరించి మణిశంకర్ అయ్యర్పై విధించిన నిషేధాన్ని తొలగించారని ఆ పార్టీ సంస్థాగత అంశాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ తెలిపారు. కాగా, ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ తర్వాత తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు.