rashmika mandana: 'గీత గోవిందం'లో తప్పకుండా చేయాలనుకున్నాను .. నాన్నను ఒప్పించాను: రష్మిక మందన

  • గీత పాత్ర నాకు బాగా నచ్చింది 
  • నా పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి 
  • నా నిర్ణయం సరైనదే    

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటించిన రష్మిక మందనకు మంచి హిట్ పడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. " కెరియర్ ఆరంభంలోనే నాకు ఇంతటి మంచి పాత్ర లభించడం .. ఈ స్థాయి సక్సెస్ పడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

సాధారణంగా నా దగ్గరికి ఏదైనా పాత్ర వచ్చినప్పుడు మా పేరెంట్స్ సలహాలతో పాటు, నా స్నేహితుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాను. ఒక్కోసారి ఈ పాత్రను చేయాల్సిందే అని నేను అనుకున్నప్పుడు ఆ విషయంలో మా నాన్నను ఒప్పిస్తాను. అలా 'గీత గోవిందం' సినిమాలో 'గీత' పాత్ర కోసం నేను మా నాన్నను ఒప్పించాను. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం .. నా పాత్రకి ప్రశంసలు లభిస్తుండటం చూస్తుంటే, నా నిర్ణయం సరైనదేనని అనిపించింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.    

More Telugu News