తూర్పున వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్సీ కందుల గుడ్బై!
- తూర్పుగోదావరిలో వైసీపీకి ఎదురుదెబ్బలు
- ఇప్పటికే వీడిన ద్వితీయ శ్రేణి నేతలు
- నేడు రాజీనామాను ప్రకటించనున్న కందుల దుర్గేశ్
రాజమహేంద్రవరం రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్న దుర్గేశ్ ప్రస్తుతం వైసీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. అయితే, తాను టికెట్ ఆశిస్తుండగా జగన్ మాత్రం ఆకుల వీర్రాజుకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోనే దుర్గేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరోపక్క తెలుస్తోంది. నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.