Mohanbabu: రాజకీయాల్లో వాజ్‌పేయిలాంటి వాళ్ళు అరుదు!: మోహన్ బాబు

  • గొప్ప వ్యక్తిత్వం వున్న ప్రధానిని కోల్పోయామన్న మోహన్ బాబు
  •  రాజకీయాల్లో వాజ్‌పేయి లాంటి వ్యక్తులు అరుదు 
  • ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఎంపీగా పని చేశా 

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయితో తనకు ఉన్న అనుబంధాన్ని సినీ నటుడు మోహన్‌బాబు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న ప్రధాని వాజ్‌పేయి అని, ఆయన తో కలిసి మూడు సార్లు వేదికపై మాట్లాడానని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు చాలా అరుదు అని ఆయన పేర్కొనారు.  

 ‘‘వాజ్‌పేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు. వాజ్ పేయి, విద్యాసాగర్‌రావు, నేను కలిసి పనిచేశాం. గొప్ప వ్యక్తిత్వం వున్న ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని షిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను’’ అంటూ మోహన్‌బాబు నివాళులు అర్పించారు. 

More Telugu News