vajpayee: తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది: ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
వాజ్ పేయి మృతితో భారతదేశం ఒక దిగ్గజ నేతను కోల్పోయిందని, తండ్రిని కోల్పోయినంత బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసంలో పార్థివదేహాన్ని మోదీ సందర్శించి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మోదీ మాట్లాడుతూ, వాజ్ పేయి మరణం దేశానికి తీరనిలోటని, ఆయన మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలిచారని, మహానాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయిదేనని కొనియాడారు.
Go Back to Shorts
vajpayee
modi

More Telugu News