vajpayee: ఎయిమ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ

  • వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ
  • ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీఎంలకు హైకమాండ్ ఆదేశం
  • కాసేపట్లో వాజ్ పేయి తాజా హెల్త్ బులెటిన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయిని పరామర్శించారు. అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుస్మాస్వరాజ్ లు ఆసుపత్రిలోనే ఉన్నారు.

ప్రస్తుతం వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది. మరోవైపు, మరి కాసేపట్లో వాజ్ పేయి ఆరోగ్యం గురించి మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.

More Telugu News