Madhya Pradesh: చూస్తుండగానే ముంచెత్తిన వరద... క్షణాల్లో కొట్టుకుపోయిన 12 మంది మిత్రబృందం... వీడియో!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • పోల్ జలపాతం వద్దకు వెళ్లిన స్నేహితులు
  • వరద పోటెత్తి నదిలోకి జారిపోయిన 12 మంది

సరదాగా పిక్నిక్ కు వెళ్లిన ఆ మిత్రబృందం క్షణాల్లో వరద నీటిలో పడి కొట్టుకుపోగా, అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని శివపురి, గ్వాలియర్ సరిహద్దుల్లోని పోల్ దగ్గరున్న పిక్నిక్ స్పాట్ లో ఈ ఘటన జరిగింది. నిన్న సెలవు రోజు కావడంతో పదుల సంఖ్యలో అక్కడికి యువత చేరుకుంది. జలపాతం వద్ద వారంతా ఆనందంగా గడుపుతున్న వేళ, ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ముంచెత్తింది.

నీటిని చూసి భయంతో 30 మంది ఓ రాతి పై భాగాన చిక్కుకుపోగా, మరో 12 మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీటిలోనే నిలబడ్డారు. క్షణాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో వీరంతా జలపాతంలో పడిపోయారు. రాతిపై చిక్కుకున్న వారిలో 8 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కాపాడారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన 12 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.

More Telugu News