Tamilnadu: 10 అత్యాచారాలు చేసిన కామాంధుడిని రెండు వారాలు మాటేసి పట్టిన పోలీసులు!

  • చెన్నైలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్
  • వివాహిత మహిళలే టార్గెట్ గా రేప్ లు
  • మహిళ ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు

వివాహమైన మహిళలను మాత్రమే టార్గెట్ చేసి, ఒంటరిగా వెళుతున్న వారికి మాయమాటలు చెప్పి, కారులోకి ఎక్కించుకుని, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారాలకు పాల్పడి, వారి నగలను దోచుకునే కామాంధుడిని చెన్నై పోలీసులు మాటేసి పట్టారు.

నీలాంగరై పోలీస్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, కాల్ టాక్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి, ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని అడయార్, తిరువాన్నియాూరు, నీలాంగరై ప్రాంతాల్లో కారు నడుపుతుంటాడు. అతనికి వివాహిత స్త్రీలంటే మోజు. ఒంటరిగా వెళ్లే వాళ్లను చూసి అత్యాచారాలకు పాల్పడతాడు. కారులో అద్దాలన్నీ మూసి, వారిని చంపేస్తానని బెదిరించి దుర్మార్గానికి దిగుతాడు.

ఇతను ఇంతవరకూ 10 మందిని రేప్ చేయగా, పరువు పోతుందని భయపడి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, కారు నంబర్ ను కూడా వెల్లడించగా, రెండు వారాల పాటు విచారణ జరిపిన పోలీసులు, అతని ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు.

వివాహిత మహిళలైతే ఫిర్యాదు చేయబోరన్న నమ్మకంతో ఇలా చేసినట్టు చెప్పాడు. 2014లో 15 ఏళ్ల బాలికపైనా సురేష్ అత్యాచారం చేసినట్టు తేల్చారు. అతనిపై నిర్భయ కేసుతో పాటు దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసి పుళల్ జైలుకు తరలించారు. ఇతని బారినపడ్డ మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు ఎవరికీ తెలియజేయబోమని పోలీసులు హామీ ఇస్తున్నారు.

More Telugu News