allu shirish: 'ఏబీసీడీ' కోసం అమెరికా వెళుతోన్న అల్లు శిరీష్

  • మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
  • తెలుగు రీమేక్ లో అల్లు శిరీష్ 
  • కథానాయికగా రుక్సన్ థిల్లాన్    

నిదానమే ప్రధానం అన్నట్టుగా అల్లు శిరీష్ ఒక్కో సినిమాకి మధ్య కొంత గ్యాప్ తీసుకుంటూ వెళుతున్నాడు. ఇంతకు ముందు ఆయన చేసిన 'ఒక్క క్షణం' ఒక ప్రయోగంగానే నిలిచింది తప్ప .. భారీ వసూళ్లను తెచ్చిపెట్టలేదు. దాంతో మంచి కథ కోసం కొంతకాలం పాటు వెయిట్ చేసిన శిరీష్, దర్శకుడు సంజీవ్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

మలయాళంలో 'ఏబీసీడీ' (అమెరికా బోర్న్ కన్ఫ్యూస్డ్ దేశి) టైటిల్ తో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమాకి ఇది రీమేక్. 2013లో 4 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 15 కోట్ల వరకూ వసూలు చేసింది. అందువల్లనే తప్పకుండా హిట్ పడాలని చూస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. రుక్సన్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ త్వరలో అమెరికా వెళుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన గెస్ట్ రోల్ చేస్తుండటం విశేషం.   

More Telugu News