keerthi suresh: 'మహానటి'కి దక్కిన మరో పురస్కారం!

  • భారీ విజయాన్ని సాధించిన 'మహానటి'
  • కీర్తి సురేశ్ కి ప్రముఖుల ప్రశంసలు 
  • తమిళంలో వరుస సినిమాలు

తెలుగు.. తమిళ భాషల్లో సావిత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఆమె బయోపిక్ ను 'మహానటి' పేరుతో నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరుగుతోన్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఐఎఫ్ ఎమ్ 18) అవార్డు వేడుకల్లో, 'మహానటి' సినిమాకి గాను పురస్కారం లభించింది. నిన్న సాయంత్రం ఈ సినిమా టీమ్ ఈ పురస్కారాన్ని అందుకుంది. అవార్డుల వేడుక అనంతరం కీర్తి సురేశ్ .. నాగ్ అశ్విన్ .. స్వప్న దత్ .. ప్రియాంక దత్ .. తరుణ్ ఆదర్శ్ కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తమిళంలో విక్రమ్ .. విశాల్ .. శివకార్తికేయన్ తో సినిమాలు చేస్తోన్న కీర్తి సురేశ్, తెలుగు కథలను వినడంలో బిజీగా వుంది. 

More Telugu News