garibnath temple: గరీభ్ నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాటలో 15 మంది భక్తులకు గాయాలు

  • బీహార్ ముజఫర్ పూర్ లో ఉన్న గరీభ్ నాథ్ ఆలయం
  • ఉత్తరాదిన శ్రావణమాసం మూడో సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, ఆలయ సిబ్బంది

బీహార్ ముజఫర్ పూర్ లో ఉన్న ప్రముఖ గరీభ్ నాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు శ్రావణమాసం మూడో సోమవారం కావడంతో, భారీ ఎత్తున భక్తులు గరీభ్ నాథ్ ఆలయానికి వచ్చారు.

ఈ రోజు శివుడికి అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు కావడంతో, భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో, అక్కడ తోపులాట చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆలయ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత భక్తులంతా క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.

More Telugu News