transstroy: మా కంపెనీలో సోదాలు జరిగిన మాట వాస్తవమే: రాయపాటి సాంబశివరావు

  • సోదాలు నిర్వహించిన సీజీఎస్టీ అధికారులు
  • పోలవరం ప్రాజెక్టు పనులు చేసిన ట్రాన్స్ ట్రాయ్
  • సోదాలు జరిగింది నిజమేనన్న రాయపాటి

నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో సీజీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్ ట్రాయ్ పన్నులు ఎగవేసినట్టు గుర్తించిన అధికారులు.. సోదాలు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను ఈ కంపెనీ చేజిక్కించుకుంది. మరోవైపు ట్రాన్స్ ట్రాయ్ వర్గాలు దీనిపై మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడం వల్లే ఈ సోదాలు జరిగాయని తెలిపాయి. దీనిపై రాయపాటి సాంబశివరావు స్పందిస్తూ, సోదాలు జరిగిన మాట నిజమేనని చెప్పారు. 

More Telugu News