nikhil: ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలతో 'ముద్ర' .. రిలీజ్ డేట్ ఖరారు

  • నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర'
  • ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి 
  • నవంబర్ 8వ తేదీన విడుదల       

నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో 'ముద్ర' సినిమా రూపొందుతోంది. ఒక తమిళ సినిమా నుంచి తీసుకున్న లైన్ ను కొత్తగా డెవలప్ చేసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ జోడీగా లావణ్యత్రిపాఠి నటిస్తోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, వచ్చేనెలలో టాకీ పార్టును పూర్తి చేసుకోనుంది.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా తనకి తప్పకుండా మంచి హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో నిఖిల్ వున్నాడు. ఇక కెరియర్ పరంగా ఈ మధ్య కాస్త వెనుకబడిన లావణ్య త్రిపాఠి, ఈ సినిమాతో తాను మళ్లీ బిజీ అవుతానని భావిస్తోంది. వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూడాలి.  

  • Loading...

More Telugu News