Crime News: ఢిల్లీలో రైలు ఢీకొని 20 ఆవులు మృతి!

  • నరేలా ప్రాంతంలో ఘటన
  • ఆవుల మంద పట్టాలను దాటుతుండగా ఢీకొన్న శతాబ్ది
  • ఆ సమయంలో గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తున్న రైలు
వేగంగా వెళుతున్న కల్కా - శతాబ్ది ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ శివార్లలోని నరేలా ప్రాంతంలో వెళుతున్న సమయంలో, ఓ ఆవుల మంద పట్టాలపైకి రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని కనీసం 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. హోలంబీ కలాన్, నరేలా మధ్య ఆవులు రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇది చాలా భయానక ఘటన అని, రైలు పట్టాలు సైతం స్వల్పంగా దెబ్బతిన్నాయని నార్త్ రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రమాదం జరిగిన గంట తరువాత ఆ రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిందని, ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆవుల మందను చూసిన రైలు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినప్పటికీ, ఫలితం లేకపోయిందని, రైలు గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుండటమే ఇందుకు కారణమని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన వెల్లడించారు.
Crime News
New Delhi
Cow
Train
Train Accident

More Telugu News