ఢిల్లీలో రైలు ఢీకొని 20 ఆవులు మృతి!
- నరేలా ప్రాంతంలో ఘటన
- ఆవుల మంద పట్టాలను దాటుతుండగా ఢీకొన్న శతాబ్ది
- ఆ సమయంలో గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తున్న రైలు
ప్రమాదం జరిగిన గంట తరువాత ఆ రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిందని, ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆవుల మందను చూసిన రైలు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినప్పటికీ, ఫలితం లేకపోయిందని, రైలు గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుండటమే ఇందుకు కారణమని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన వెల్లడించారు.