Rajya Sabha: టీఆర్ఎస్ కూడా హ్యాండిచ్చింది... రాజ్యసభ ఎన్నికలకు దూరమట!

  • యూపీఏకు దెబ్బ మీద దెబ్బ
  • వరుసగా షాకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు
  • ఓటింగ్ లో పాల్గొనరాదని కేసీఆర్ నిర్ణయం
నేడు జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష యూపీఏకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రతిపక్షంలోని పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటాయని, తమ అభ్యర్థి విజయం సులువేనని భావిస్తూ వచ్చిన ఆ పార్టీకి తొలుత ఆమ్ ఆద్మీ, ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ షాకిచ్చాయి. ఈ ఎన్నికల ఒటింగ్ కు ఎంపీలంతా దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఎంపీలకు ఆదేశాలు అందాయి. దీంతో ఓటింగ్ ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. కాగా, ఎన్డీయే తరఫున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్, యూపీఏ తరఫున కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
Rajya Sabha
Deputy Chairman
Voting
Congress
TRS
Boycot

More Telugu News