karunanidhi: కరుణానిధిని ఉంచే శవపేటికపై ఆయన మాటలనే చెక్కించారు!

  • 33 ఏళ్ల క్రితం కరుణ.. స్టాలిన్ కు ఓ మాట చెప్పారట
  • ఆ మాటనే శవపేటికపై తమిళంలో చెక్కించారు
  • రాజాజీ హాల్ నుంచి ప్రారంభం కానున్న అంతిమయాత్ర

ముప్పై మూడేళ్ల క్రితం కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ కు ఓ మాట చెప్పారట. ‘మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి..‘విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు’ అనేంతగా పేరు తెచ్చుకోవాలి’ అని స్టాలిన్ కు కరుణ చెప్పారట. ఇప్పుడు, ఈ విషయం గురించి ప్రస్తావించడం ఎందుకంటే, కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచే శవపేటికపై ఆ మాటలనే తమిళంలో చెక్కించారు. కాగా, రాజాజీహాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది.

More Telugu News