karunanidhi: కరుణానిధికి నివాళిగా 'గుండు' చేయించుకున్న అభిమానులు

  • తమిళనాడు వ్యాప్తంగా కరుణ అభిమానుల నివాళి
  • కోయంబత్తూరులో గుండ్లు చేయించుకున్న వైనం
  • రాజాజీ హాల్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు

డీఎంకే అధినేత కరుణానిధి మృతితో ఆయన అభిమానులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమ అభిమాన నేత కరుణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కరుణకు నివాళిగా కోయంబత్తూరులో కొందరు అభిమానులు, ఆయన మద్దతుదారులు గుండ్లు చేయించుకుంటున్నారు.

కాగా, చెన్నైలోని రాజాజీ హాల్ లో కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కరుణానిధి భౌతికకాయాన్ని దగ్గరి నుంచి చూసేందుకు అభిమానుల యత్నించారు. బారికేడ్లు దాటి చొచ్చుకొచ్చేందుకు యత్నిస్తున్న అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు.

More Telugu News