nagashauraya: హాస్యమే ప్రధానాంశంగా 'నర్తనశాల' టీజర్

  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య 
  • విభిన్నమైన కథాంశంతో తాజా చిత్రం 
  • మరోసారి హిట్ ఖాయమనే నమ్మకం

'ఛలో' సినిమా హిట్ తరువాత వైవిధ్యభరితమైన మరో కథ కోసం వెయిట్ చేసిన నాగశౌర్య, తన సొంత బ్యానర్లోనే 'నర్తనశాల' సినిమా చేశాడు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన కశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, హాస్య ప్రధానంగా కొనసాగింది.

చిన్నప్పటి నుంచి ఆడపిల్లలా పెంచబడిన హీరో .. అమ్మాయిలకి దూరంగా ఉంటూ వుంటాడు. ఫలితంగా చోటుచేసుకునే సరదా సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుందనే విషయం టీజర్ వలన స్పష్టమవుతోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా .. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా తనకి మరో హిట్ ను ఇస్తుందనే ఉద్దేశంతో నాగశౌర్య వున్నాడు. ఇక కథానాయికలిద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశాభావంతో వున్నారు. 

  • Loading...

More Telugu News