karunanidhi: కరుణకు ప్రధాని మోదీ నివాళి.. హోరెత్తిన రాజాజీ హాల్!

  • కలైంజర్ కు మోదీ నివాళి
  • కుటుంబ సభ్యులని ఓదార్చిన ప్రధాని
  • అభిమానుల నినాదాలతో మార్మోగిన రాజాజీ హాల్

రాజాజీ హాల్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణుల నినాదాలతో రాజాజీ హాల్ హోరెత్తింది. కరుణకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులని మోదీ ఓదార్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.

ప్రధాని మోదీ వెంట రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఉన్నారు. కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News