kvp: ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి: కేవీపీ

  • ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఎన్ఎస్ యూఐ ధర్నా
  • కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం
  • ప్లీనరీ సమావేశంలో ‘హోదా’పై చర్చిస్తాం: కేవీపీ

ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఎన్ఎస్ యూఐ ఈరోజు ధర్నా చేసింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీపీ, జేడీ శీలం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని, ప్లీనరీ సమావేశంలో ‘హోదా’ అంశాన్ని చర్చిస్తామని అన్నారు.

More Telugu News