Gaddar: ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అడుగడుగునా మోసం చేస్తోంది!: ప్రజాగాయకుడు గద్దర్

  • గుంటూరు 'పొలికేక' సభకు హాజరైన గద్దర్ 
  • ప్రత్యేక హోదా పోరాటాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు 
  • అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నప్రజా గాయకుడు

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగునా మోసం చేస్తోందన్నారు. గుంటూరులో సోమవారం బహుజన చైతన్య మహాసభ  ఆధ్వర్యంలో ‘పొలికేక సభ’ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దర్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఏపీలో పోరాటాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పార్లమెంటులో కంటి తుడుపు చర్యల వల్ల ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పుడే వారికి న్యాయం జరుగుతుందన్నారు. దళిత క్రైస్తవులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో శ్రమ చేసే వారికి గౌరవం లభించాలని, వారి వల్లే సంపద సృష్టించబడుతోందని గద్దర్ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సూచించిన నిచ్చెనమెట్ల విధానాన్ని కళాకారులతో ప్రదర్శించారు. 

  • Loading...

More Telugu News