Chandrababu: ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఏపీ పీడీ అకౌంట్స్: జీవీఎల్ ఆరోపణ

  • రూ.53 వేల కోట్లు లూటీ చేసినట్టు రుజువైంది
  • ఈ కుంభకోణం 2జీ, బొగ్గు, సీడబ్ల్యూసీ.. మాదిరి ఉంది
  • చంద్రబాబు, లోకేశ్ సమాధానం చెప్పాలి?

ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఏపీ పీడీ అకౌంట్స్ అని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రూ.53 వేల కోట్లు లూటీ చేసి, దారి మళ్లించినట్లు రుజువైందని, ఈ కుంభకోణం 2జీ, బొగ్గు, సీడబ్ల్యూసీ, ఫాడర్ స్కీమ్ మాదిరిగా ఉందని ఆరోపించారు. ఈ విషయానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ కుంభకోణం నుంచి వారిని బయట పడేయలేదనే, ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిందంటూ జీవీఎల్ తన ట్వీట్ లో ఆరోపించారు.

More Telugu News