Vizag: విశాఖ కైలాసగిరిపై అదుపు తప్పిన బ్యాటరీ కారు... మహిళ మృతి!

  • నగర సందర్శనకు వచ్చిన బెంగళూరు వాసులు
  • శివపార్వతుల విగ్రహాల వద్ద కారు బ్రేకులు ఫెయిల్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి మృతి

విశాఖపట్నంలో నిత్యమూ పర్యాటకులతో కిటకిటలాడే కైలాసగిరి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పర్యాటకులను తీసుకెళ్లే ఓ బ్యాటరీ కారు అదుపుతప్పి బెంగళూరుకు చెందిన కె.రాజ్యలక్ష్మి (37) అనే మహిళ మరణించింది. తన బంధుమిత్రులతో కలసి విశాఖ సందర్శనకు వచ్చిన రాజ్యలక్ష్మి, తెలుగు మ్యూజియం సందర్శించారు.

ఆపై అక్కడి బ్యాటరీ కారు ఎక్కి శివపార్వతుల విగ్రహాలవైపు వెళ్లారు. ఆ సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్, దాన్ని అదుపు చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. అంతలోనే ఆ కారు వేగంగా వెళ్లి, బస్టాప్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News