jagan: స్వల్ప అస్వస్థతకు గురైన జగన్

  • పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర
  • జ్వరం, జలుబుతో బాధ పడుతున్న జగన్
  • వైద్య చికిత్స అందించిన వైద్యులు

అలుపెరుగకుండా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెందుర్తి క్రాస్ రోడ్డు వద్ద ఈ ఉదయం 228వ రోజు పాదయాత్ర మొదలైంది. పాదయాత్రలో ఉండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో, వైద్యులు ఆయనకు చికిత్సను అందించారు. 

More Telugu News