Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ లోకి చాలా మంది వస్తున్నారు.. పేర్లు ఇప్పుడే చెప్పం: భట్టి

  • పేర్లను వెల్లడిస్తే అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుంది
  • ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా చేస్తున్నారు
  • టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులనే కలెక్టర్లుగా చేసేటట్టు ఉన్నారు

ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతామంటున్నారని... అలాంటి వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉండే ప్రతి ఒక్కరినీ పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. అయితే పార్టీలో చేరబోయే నేతల పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని... పేర్లు బయటకు వస్తే అధికార పార్టీ బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుందని అన్నారు.

ప్రభుత్వ తీరు చాలా బాధాకరంగా ఉందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులనే జిల్లా కలెక్టర్లుగా చేసేట్టు ఉన్నారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ ను కూడా పాటించడం లేదని... ఈ అంశంపై చీఫ్ సెక్రటరీకి, స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

More Telugu News