kukatpally: న్యూసెంచరీ స్కూల్ ఘటన..కూకట్ పల్లి ఎంఈవో సస్పెన్షన్

  • ఎంఈవోను సస్పెండ్ చేయడం జరిగింది 
  • ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం: ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో న్యూసెంచరీ పాఠశాలలో షెడ్ కూలడంతో నిన్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కూకట్ పల్లి ఎంఈవోను సస్పెండ్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తుందని, క్షతగాత్రులకు వైద్యఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోందని కృష్ణారావు చెప్పారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న 170 మంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని, మరో పాఠశాలలో అడ్మిషన్ కల్పిస్తామని చెప్పారు.

More Telugu News