jena sena: పచ్చి అబద్ధాన్ని కూడా వాస్తవమని నమ్మించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారు: సీపీఐ నేత రామకృష్ణ

  • మోదీ డైరెక్ష‌న్ లో ప‌వ‌న్ న‌డుస్తున్నార‌ంటారా?
  • సీఎం చంద్ర‌బాబు, మంత్రుల త‌ప్పుడు ప్ర‌చారం తగదు
  • చంద్రబాబు యూట‌ర్న్ తీసుకున్నారు

ప్ర‌ధాని మోదీ డైరెక్ష‌న్ లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌డుస్తున్నార‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మండిపడ్డారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో వామపక్ష పార్టీల నేతలు ఈరోజు సమావేశమయ్యారు.

అనంతరం, మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ, భార‌తీయ జ‌న‌తా పార్టీతో సంబంధం ఉన్న ఏ రాజ‌కీయ పార్టీతోనూ కమ్యూనిస్టులు క‌లిసి ప‌ని చేయ‌ర‌ని, అలాగే క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి ప‌ని చేసే ఏ నాయకుడినీ బీజేపీ ప్రోత్సహించదని, రాజ‌కీయంగా క‌నీస ఇంగిత జ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఈ విష‌యం తెలుస‌ని అన్నారు. అయినప్పటికీ చంద్ర‌బాబు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు ప‌చ్చి అబద్ధాన్ని కూడా వాస్త‌వమ‌ని న‌మ్మించ‌డానికి శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తార‌ని రామకృష్ణ విమర్శించారు. ప్ర‌త్యేక ప్యాకేజీ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌పుడు అసెంబ్లీలో హ‌ర్షిస్తూ తీర్మానాలు చేసి, కేంద్ర‌మంత్రుల‌కు స‌న్మానాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News