pawan kalyan: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు పవన్ కల్యాణ్ నివాళి

  • నేడు పింగళి వెంకయ్య జయంతి 
  • హైదరాబాదులో కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన
  • అంజలి ఘటించిన పవన్ కల్యాణ్

మువ్వన్నెల మన జాతీయ పతాకాన్ని రూపొందించిన దివంగత పింగళి వెంకయ్య జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఈ ఉదయం హైదరాబాదు మాదాపూర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో వెంకయ్య త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

More Telugu News