Pawan Kalyan: పవన్ తో నేడు భేటీ కానున్న మోత్కుపల్లి.. జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం?

  • మధ్యాహ్నం 3 గంటలకు పవన్ తో మోత్కుపల్లి భేటీ
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం
  • జనసేనలో మోత్కుపల్లి చేరే అవకాశం

బహిష్కృత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వీరి భేటీ జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేనలో మోత్కుపల్లి చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే కోణంలో చర్చ జరుగుతోంది. మరోవైపు, జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మోత్కుపల్లిని నియమించే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా పూర్తి క్లారిటీ రావాలంటే ఈ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

More Telugu News