shakeela: 17న విడుదల కానున్న షకీలా 250వ సినిమా

  • ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'శీలవతి'
  • 250వ సినిమా కావడం సంతోషంగా ఉందన్న షకీలా
  • ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది

శృంగార నటిగా పేరుగాంచిన షకీల గత కొన్నేళ్లుగా మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'శీలవతి' ఈ నెల 17న విడుదల కానుంది. కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిరాం దాసరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా... రాఘవ ఎం గణేష్, వీరు బాసింశెట్టిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షకీలాకు 250వ చిత్రం కావడం గమనార్హం.

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ, ఇది తనకు 250వ సినిమా కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని... ఉత్కంఠ కలిగేలా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచారని తెలిపింది. ఈ సినిమా చూసిన వారంతా ఇంతకు ముందు షకీలా వేరు, ఇప్పటి షకీలా వేరు అని అంటారని చెప్పింది.

More Telugu News