rajamahendravaram: కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే బలిదానం చేసుకుంటానంటూ ఓ వ్యక్తి హల్ చల్!

  • రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి హల్ చల్
  • పోలీసులకు, మీడియాకు ఫోన్ కాల్స్ చేసిన వైనం
  • ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే బలిదానం చేసుకుంటానంటూ రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఆ వ్యక్తి పోలీసులకు, మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్స్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News