kamal: 'విశ్వరూపం' ఆడియో రిలీజ్ రేపే

  • దేశభక్తి నేపథ్యంలో 'విశ్వరూపం 2'
  • దర్శక నిర్మాతగా కమల్ 
  • ఆగస్టు 10వ తేదీన భారీ రిలీజ్  

కమలహాసన్ కథానాయకుడిగా 'విశ్వరూపం 2' రూపొందింది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ సినిమాకి నిర్మాతలలో ఒకరిగానే కాదు .. దర్శకుడిగానూ కమల్ వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు. 'విశ్వరూపం' తొలిభాగానికి మించిన వసూళ్లను ఈ సినిమా సాధిస్తుందని కమలహాసన్ భావిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.    

More Telugu News