sushanth: ఫస్టాఫ్ చూడగానే ఏడ్చేశాను: 'చి ల సౌ' గురించి సమంత

  • చిన్మయి నా స్నేహితురాలు 
  • రాహుల్ నాకు చాలాకాలంగా తెలుసు 
  • ఆయనలో మంచి దర్శకుడు వున్నాడు  

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'చి ల సౌ' సినిమా రూపొందింది. సుశాంత్ .. రుహాని శర్మ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి చూపుల్లో కలుసుకున్న ఒక అమ్మాయి .. అబ్బాయి ఓ మర్డర్ కారణంగా ఒక రాత్రంతా ఒకచోట వుండి పోవలసి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేదే కథాంశం. రాహుల్ రవీంద్ర భార్య చిన్మయి .. సమంతకు డబ్బింగ్ చెబుతూ వుంటుందనే విషయం తెలిసిందే. ఇక రాహుల్ కూడా సమంతకు చాలా కాలంగా తెలుసు. అందువలన రాహుల్ .. చిన్మయి కలిసి సమంత కోసం 'చి ల సౌ' స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూసిన సమంత తనదైన శైలిలో స్పందించింది. "డైరెక్టర్ కావాలనేది మొదటి నుంచి రాహుల్ కి వున్న ఆశ. ఈ సినిమా చూడమని ఆయన కోరినప్పుడు .. ఏం చెప్పాల్సి వస్తుందా అనే భయంతోనే చూశాను. ఫస్టాఫ్ చూస్తుండగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి. రాహుల్ లో మంచి దర్శకుడు వున్నాడని చెప్పడానికి గర్వపడ్డాను. ఈ సినిమా దర్శకుడిగా ఆయనను నిలబెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.  

  • Loading...

More Telugu News