Rashmika Mandana: హీరోలు చేస్తున్నదే మేము చేస్తే తప్పా?: ప్రశ్నిస్తున్న 'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక

  • కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం
  • ఆ తరువాతే టాలీవుడ్ కు పరిచయం
  • పెళ్లి అయిన హీరోలు తెరపై రొమాన్స్ చేయడం లేదా?
  • ట్రోల్ చేస్తున్న వారికి రష్మిక ప్రశ్న

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం కాకముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్న 'గీత గోవిందం' ఫేమ్ రష్మిక మందన, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పెట్టిన కొన్ని పోస్టులపై అభిమానులు ట్రోల్ చేస్తుండగా, రష్మిక సైతం కాస్తంత గట్టిగానే స్పందించింది. సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె మితిమీరిన రొమాన్స్ చేసిందని, నిశ్చితార్థం జరిగిన తరువాత సినిమాల్లో నటిస్తూ ఇలా మితిమీరడం అవసరమా? అంటూ కొందరు ప్రశ్నించారు.

దీనికి రష్మిక సమాధానం ఇస్తూ, కేవలం పోస్టర్లను చూసి కొందరు ఈ మాటలు అంటున్నారని, నటిగా తాను ఎదుగుతూ ఉంటే  చాలా మంది తట్టుకోలేకపోతున్నారని ఆరోపించింది. వివాహం చేసుకున్న హీరోలు తెరపై రొమాన్స్ చేస్తే తప్పు కానప్పుడు పెళ్లి తరువాత హీరోయిన్లు రొమాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఈ ఆలోచనలో మార్పు రావాలని హితవు పలికింది. రక్షిత్ తనకు దక్కాడని, విజయ్ దేవరకొండతో నటిస్తున్నానని అసూయ పడుతున్న కొందరు ఈ తరహా వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించింది రష్మిక.

More Telugu News