Parliament: పార్లమెంటులో ఈల వేస్తున్న స్మృతీ ఇరానీ... వైరల్ అవుతున్న ఫొటో వెనుక అసలు సంగతి!

  • పార్లమెంట్ ను స్మృతీ అవమానించారు
  • వైరల్ చేస్తున్న కాంగ్రెస్ మద్దతుదారులు
  • అది గత సంవత్సరం ఫొటో అని తేల్చిన నెటిజన్లు

పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈల వేశారని, తద్వారా ఆమె పార్లమెంట్ ను అవమానించారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. గత నెలలో లోక్ సభ ముందుకు వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, ఆపై తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టిన దృశ్యాలను బీజేపీ వైరల్ చేస్తుండగా, దీనికి ప్రతిగా, స్మృతీ ఇరానీ ఈల వేస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.

నసీమ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ ఫొటోను తొలుత షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోను గూగుల్ లో వెతుకగా, అది గత సంవత్సరం అక్టోబర్ దని, ఆమె ఈల వేసింది పార్లమెంట్ లో కాదని తెలుస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వేళ, విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు స్మృతీ ఇరానీ విజిల్ వేశారని తెలుస్తోంది. ఇక బీజేపీ మద్దతుదారులు ఇదే విషయాన్ని తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంటున్నారు.

More Telugu News