ap congress: రేపు ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం

  • విజయవాడలో రేపు ఉద‌యం సమావేశం
  • భ‌విష‌త్య్ కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్రకటిస్తాం
  • ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.ఎన్‌.రాజా వెల్లడి

రేపు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జరుగుతుందని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.ఎన్‌.రాజా తెలిపారు. విజయవాడలోని ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో రేపు ఉద‌యం పది గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

 స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో జిల్లాల వారీగా పార్టీ ప‌నితీరు, నాయ‌కుల నుంచి సేక‌రించిన వివ‌రాల‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు భ‌విష‌త్య్ కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తార‌ని పేర్కొన్నారు.

ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రఘువీరారెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రుగుతుంద‌ని, ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ఊమెన్ చాందీ, స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యులు, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, జిల్లా, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, అనుబంధ సంఘాల చైర్మ‌న్లు, వివిధ‌ విభాగాల చైర్మ‌న్లు పాల్గొంటార‌ని తెలిపారు.  

  • Loading...

More Telugu News