varun tej: ముగింపు దశకి చేరుకున్న 'అంతరిక్షం'

  • రామేశ్వరంలో జరిగిన షూటింగ్ 
  • 70 శాతం జరిగిన చిత్రీకరణ
  • వచ్చేనెలలో షూటింగ్ పార్టు పూర్తి  

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. అంతరిక్షం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది కనుక, 'అంతరిక్షం' అనే పేరునే పరిశీలిస్తున్నారు. రాజీవ్ రెడ్డి .. సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా తమిళనాడులోని రామేశ్వరంలో షూటింగు జరుపుకుంటోంది. అక్కడి అబ్దుల్ కలామ్ పాఠశాలలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

 ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. మిగిలిన భాగం చిత్రీకరణను ఆగస్టులో పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారు. వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికలుగా లావణ్య త్రిపాఠి .. అదితీ రావు హైదరీ నటిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ .. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని చెబుతున్నారు.

More Telugu News