కాబోయే ప్రధాని ఇమ్రాన్కు ఫోన్ చేసి అభినందించిన మోదీ
- పాక్లో ప్రజాస్వామ్యం బలపడుతుందని మోదీ ఆకాంక్ష
- ఆగస్టు 11న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం
- గెలిచిన వెంటనే మోదీపై ఇమ్రాన్ విమర్శలు
కాగా, ఎన్నికల్లో ఇమ్రాన్ విజయం సాధించిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను నవాజ్ షరీఫ్ను కానని పేర్కొంటూనే భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. భారత్ ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానన్నారు. కాగా, డిసెంబరు 11, 2015న భారత పర్యటనకు వచ్చిన ఇమ్రాన్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు.