గురుపూర్ణిమ రోజున ఆదాయంలో తిరుమలను దాటేసిన షిర్డీ!
- రికార్డు స్థాయిలో సాయినాథుని ఆదాయం
- గురు పూర్ణిమకి ముందు రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.26 కోట్లు
- గురు పూర్ణిమ రోజున సాయినాథునికి వచ్చిన ఆదాయం రూ.6.40 కోట్లు
ఆదాయంలో ఎప్పుడూ ముందుండే శ్రీవారికి ఈసారి తగ్గడం వెనక చంద్రగ్రహణం కారణమని చెబుతున్నారు. గురుపూర్ణిమ రోజున ఉదయం పది గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ తర్వాత సర్వ దర్శనానికి అనుమతి ఇచ్చారు. అంటే, దాదాపు ఒక రోజంతా స్వామి వారిని దర్శించుకునే అవకాశం భక్తులకు లేకుండా పోయింది. ఈ కారణంగానే స్వామి వారికి వచ్చే ఆదాయం తగ్గినట్టు చెబుతున్నారు.