karthi: 'చినబాబు' అక్కడ దుమ్మురేపేస్తున్నాడు

  • కార్తీ హీరోగా వచ్చిన 'కడైకుట్టి సింగం'
  • మూడు వారాల్లో 40 కోట్ల గ్రాస్ 
  • కార్తీ కెరియర్లోనే భారీ వసూళ్లు  

కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో 'కడైకుట్టి సింగం' చిత్రం తెరకెక్కింది. సాయేషా సైగలా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజున 'చినబాబు' పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాకి ఇక్కడ ఓ మాదిరిగా మాత్రమే ఆదరణ లభించింది.

తమిళంలో మాత్రం మూడు వారాలకి గాను ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కార్తీ కెరియర్లో ఇవే అత్యధిక వసూళ్లు అని చెబుతున్నారు. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్లో నిర్మించాడు. అందువలన ఈ సినిమా హీరోగా కార్తీకి .. నిర్మాతగా సూర్యకి కలిసొచ్చిందని అంటున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ .. గ్రామీణ నేపథ్యం .. రైతు సమస్యలపై పోరాటం ఈ సినిమాను ప్రేక్షకుల మనసుకు దగ్గరగా తీసుకెళ్లాయి. ఈ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిందని చెప్పుకుంటున్నారు.       

More Telugu News