Preeti Jinta: 19 సంవత్సరాల క్రితం మహేశ్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ప్రీతీ జింతా!

  • 'రాజకుమారుడు' షూటింగ్ సమయంలో ఫొటో
  • కృష్ణ, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కూడా
  • అభిమానులతో పంచుకున్న ప్రీతీ జింతా

మహేశ్ బాబుతో తాను నటించినప్పటి సంగతులను సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింతా గుర్తు చేసుకుంది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'రాజకుమారుడు' చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫొటోను షేర్ చేసుకుంది. తామంతా సీరియస్ గా ఓ ఫొటో తీయించుకున్నామని చెప్పింది. 19 సంవత్సరాల క్రితం దీన్ని తీశారని వ్యాఖ్యానించింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు, ప్రీతితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, 'రాజకుమారుడు' నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News