Secunderabad: నా బోనం నాకిచ్చి మీరేంటి నన్నడిగేది?: భవిష్యవాణిలో అమ్మ ఆగ్రహం

  • బంగారు బోనంతో సంతోషించావా? 
  • రంగంలో అమ్మను ప్రశ్నించిన పూజారి
  • తన బోనమే కదా అన్న అమ్మవారు

తన బోనాన్ని తనకు సమర్పించి సంతృప్తి చెందావా? అని ప్రశ్నించడం ఏంటని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో, అమ్మవారిని తనలోకి ఆవహింపజేసుకుని రంగం వినిపించిన స్వర్ణలత ప్రశ్నించింది. ఈ సంవత్సరం బంగారు బోనాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆలయ ప్రధాన పూజారి, సంతృప్తి చెందావా అమ్మా? అని ప్రశ్నించగా, స్వర్ణలత పై వ్యాఖ్యలు చేసింది.

 తన బోనాన్నే తనకు ఇచ్చారే తప్ప కొత్తగా ఏం చేశారని అడిగింది. ఈ సంవత్సరం ఉత్సవాలు తనకు సంతోషాన్ని కలిగించలేదని వ్యాఖ్యానించింది. ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తే... సంతోషం లేదని ఎలా చెబుతావమ్మా? అని అడుగగా, తనను ప్రశ్నించడానికి నువ్వెవరని అమ్మ గద్దించేసరికి అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు.

More Telugu News