Jagan: జగన్ కు మొక్కజొన్న పొత్తులిచ్చిన అభిమానులు.. రుచి చూసిన వైసీపీ అధినేత!

  • తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ యాత్ర
  • జగన్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన ప్రజలు
  • జగన్ ని తినమంటూ మొక్కజొన్న పొత్తులిచ్చిన వైనం

వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ప్రారంభమై రామవరం, గోనెడ, రామచంద్రాపురం మీదుగా వీరవరం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసిన ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. జగన్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు, ఆయన ఆటో గ్రాఫ్ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా జగన్ కు మొక్కజొన్న పొత్తులను ఆయన అభిమానులు ఇచ్చారు. అందులో ఒక మొక్కజొన్న పొత్తును ఓ యువతికి ఇచ్చిన జగన్, మరోటి ఆయన తిన్నారు. 

More Telugu News