Andhra Pradesh: జనసేన, వామపక్షాలు కలసి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడతాయి: సీపీఐ రామకృష్ణ

  • 2019 ఎన్నికల్లో జనసేనతో కలసి వామపక్ష కూటమి
  • ఇప్పటికే కలసికట్టుగా పోరాడుతున్న మూడు పార్టీలు
  • ఎన్నికలపై పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పవన్

రానున్న ఎన్నికల్లో పొత్తుల గురించి ఏపీ సీపీఐ పూర్తి స్పష్టతను ఇచ్చింది. జనసేన పార్టీతో కలసి సీపీఐ, సీపీఎంలు థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడతాయని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే జనసేన, సీపీఐ, సీపీఎంలు కలసికట్టుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనలో కొంచెం వామపక్ష భావజాలం ఉందనే విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎన్నికలకు జనసేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలపై పవన్ కల్యాణ్ ఇప్పటికే దాడిని తీవ్రతరం చేశారు. 2019 అధికారం తమదే అని చెబుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

More Telugu News