k.viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ పై ‘బయోపిక్’

  • దర్శకుడు కె.విశ్వనాథ్ జీవితకథ ఆధారంగా బయోపిక్
  • దర్శకత్వం వహించనున్న జనార్దన మహర్షి
  • హైదరాబాద్ లో నిర్వహించిన పూజా కార్యక్రమాలు 

తెలుగులో ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు పొందిన విశ్వనాథ్ పై ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్ కు ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ బయోపిక్ లో విశ్వనాథ్ పాత్రను ఎవరు పోషిస్తారనేది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా,1965లో వచ్చిన 'ఆత్మగౌరవం' చిత్రానికి విశ్వనాథ్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ప్రైవేట్ మాస్టర్, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టుపెడతా, నిండు హృదయాలు, చెల్లెలికాపురం.... సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతికిరణం వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

More Telugu News