shyamala: 'బిగ్ బాస్ 2' లో ఆ ఇద్దరిలో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ వుంది: యాంకర్ శ్యామల

  • ఆ రోజున నా ఎలిమినేషన్ అలా జరిగింది
  • 'బిగ్ బాస్' ఎందుకలా చేశారో అర్థం కాలేదు
  •  చివరికి ఆ ఇద్దరు మిగులుతారని అనుకుంటున్నాను

'బిగ్ బాస్ హౌస్'లో కొన్ని రోజుల పాటు కొనసాగిన యాంకర్ శ్యామల, ఆ తరువాత ఎలిమినేట్ అయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె 'బిగ్ బాస్ 2' గురించి మాట్లాడింది. " బిగ్ బాస్ హౌస్ లో ఆట ఎవరు బాగా ఆడుతుంటే వాళ్లని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు .. ఈ విషయంలో వాళ్లు చాలా ఓపెన్ గా వున్నారు.

నేను ఎలిమినేట్ కావడం వెనుక కంటెస్టెంట్స్ పాత్ర వుంది. ఆ రోజున ఎలిమినేషన్ జాబితాలో ముగ్గురం వున్నాం. అందులో మిగతా ఇద్దరి కంటే తక్కువ పొజీషన్ లో నేను వున్నానని అనుకోవడం లేదు. ఆ రోజున బిగ్ బాస్ నా ఎలిమినేషన్ ను తీసుకెళ్లి కంటెస్టెంట్స్ చేతిలో ఎందుకుపెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వున్న వాళ్లలో చివరి వరకూ నిలబడేవాళ్లుగా గీతామాధురి .. కౌశల్ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విజేతగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎంతమంది ఎన్నిచేసినా వాళ్లు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుంటారు .. అందుకే వాళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలవచ్చని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.    

More Telugu News