'సాక్ష్యం'కు ఎదురు దెబ్బ... పడని మార్నింగ్ షో!
- నిర్మాత, ఫైనాన్షియర్ మధ్య విభేదాలు
- తెల్లవారుజాము షో, మార్నింగ్ షోలు రద్దు
- సాంకేతిక సమస్యలే కారణమంటున్న చిత్ర యూనిట్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా సినిమా విడుదల కాకపోగా, ముందే టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని థియేటర్లకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో ఉదయం 8.45 గంటలకు పడాల్సిన షో రద్దయింది. సమస్యలను పరిష్కరించుకుని కనీసం మ్యాట్నీ షో అయినా వేయాలని ప్రొడ్యూసర్స్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఏ థియేటర్ కూ డిజిటల్ ప్రింట్ అందలేదని తెలుస్తుండగా, కనీసం మ్యాట్నీ అయినా పడుతుందో లేదోనని బెల్లంకొండ అభిమానులు ఆందోళనతో ఉన్నారు.