ap congress: నాపై రాజకీయ కక్షతో వల్లభనేని వంశీయే ఈ చీటింగ్ కేసు పెట్టించారు!: ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ

  • వల్లభనేని వంశీపై ఆరోపణలు
  • ఇప్పటికే, నాపై నాలుగు కేసులు పెట్టించారు
  • వంశీ అక్రమాలకు పాల్పడుతున్నారు

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తనపై రాజకీయ కక్షతోనే చీటింగ్ కేసు నమోదు చేశారని, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే ఈ చీటింగ్ కేసు పెట్టించారని ఆరోపించారు.

ఇప్పటికే, తనపై వంశీ నాలుగు కేసులు పెట్టించారని, తనపై కేసులు పెట్టించడమే వంశీ పని అని ఆమె మండిపడ్డారు. బ్రహ్మలింగేశ్వరస్వామి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుకుంటూ వంశీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టినందుకే తనపై లేనిపోని కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News